మన పత్రిక, వెబ్డెస్క్: హుజురాబాద్ మండలంలో ముగ్గురు ప్రభుత్వ ఉపాధ్యాయులపై వేటు పడింది (3 TEACHERS SUSPENDED IN HUZURABAD MANDAL). విధుల్లో నిర్లక్ష్యం, పాఠశాలకు మద్యం సేవించి రావడం వంటి తీవ్రమైన ఆరోపణల నేపథ్యంలో వారిని సస్పెండ్ చేస్తూ జిల్లా విద్యాశాఖ అధికారి (DEO) ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.
సస్పెండ్ అయిన వారిలో హుజురాబాద్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన పీఈటీ, ఫిజికల్ సైన్స్ టీచర్, అలాగే చెల్పూర్ పాఠశాలకు చెందిన మరో ఫిజికల్ సైన్స్ టీచర్ ఉన్నారు. హుజురాబాద్ టీచర్లు మద్యం సేవించి విధులకు హాజరైనట్లు ఆరోపణలు ఉన్నాయి.
మరో ఉపాధ్యాయుడు విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తూ, ఉన్నతాధికారుల ఆదేశాలను బేఖాతరు చేయడం, విద్యార్థులను నిరుత్సాహపరచడం వంటి చర్యలకు పాల్పడినట్లు అధికారులు గుర్తించారు. పదేపదే హెచ్చరించినా తీరు మార్చుకోకపోవడంతో వారిపై సస్పెన్షన్ వేటు పడింది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
