Advertisement

Formula E Car Race: కేటీఆర్‌పై విచారణకు గవర్నర్ అనుమతి

మన పత్రిక, వెబ్​డెస్క్: బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్‌, మాజీ మంత్రి కేటీఆర్‌కు (KTR) పెద్ద షాక్ తగిలింది. ఫార్ములా ఈ–కారు రేసు (ktr formula e car race) కేసులో విచారణకు గవర్నర్ అధికారిక అనుమతి ఇచ్చారు. దీంతో ఏసీబీ అధికారులు ఆయనపై అభియోగాలు నమోదు చేసి విచారణను వేగవంతం చేసే అవకాశముంది.

బీఆర్‌ఎస్ పాలనలో హైదరాబాద్‌లో జరిగిన ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో భారీ అవినీతి జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపణలతో కేసు ఏసీబీకి వెళ్లింది. ఈ కేసులో కేటీఆర్‌ను ఇప్పటికే నాలుగు సార్లు, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్‌ను పలుమార్లు విచారించారు. గవర్నర్ అనుమతి రావడంతో త్వరలో ఛార్జిషీట్ దాఖలు చేసి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.

Advertisement

Advertisement