మన పత్రిక, వెబ్డెస్క్: బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్కు (KTR) పెద్ద షాక్ తగిలింది. ఫార్ములా ఈ–కారు రేసు (ktr formula e car race) కేసులో విచారణకు గవర్నర్ అధికారిక అనుమతి ఇచ్చారు. దీంతో ఏసీబీ అధికారులు ఆయనపై అభియోగాలు నమోదు చేసి విచారణను వేగవంతం చేసే అవకాశముంది.
బీఆర్ఎస్ పాలనలో హైదరాబాద్లో జరిగిన ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో భారీ అవినీతి జరిగినట్లు కాంగ్రెస్ ఆరోపణలతో కేసు ఏసీబీకి వెళ్లింది. ఈ కేసులో కేటీఆర్ను ఇప్పటికే నాలుగు సార్లు, ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ను పలుమార్లు విచారించారు. గవర్నర్ అనుమతి రావడంతో త్వరలో ఛార్జిషీట్ దాఖలు చేసి తదుపరి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నట్లు సమాచారం.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
