Last rites : మహబూబ్నగర్లో హృదయ విదారక ఘటన చోటు చేసుకుంది. కన్న కొడుక్కి అంత్యక్రియలు చేసేందుకు డబ్బులు లేక స్మశానంలో 8 గంటలుగా ఏడుస్తూ కూర్చున్నాడు ఓ తండ్రి. బతికి ఉన్నప్పుడు తిండి పెట్టలేకపోయాను.. చనిపోయాక అంత్యక్రియలు చేయలేకపోయాను.. అని బాలరాజ్ అనే వ్యక్తి ఆవేదన వ్యక్తం చేశాడు.
జిల్లా కేంద్రంలోని ప్రేమ్ నగర్ లో ఉన్న పత్తి మిల్లులో పని చేస్తున్న బాలరాజ్ కు భార్య, ఇద్దరు కొడుకులు. ఇటీవల పత్తి మిల్లు మూతపడటంతో ఉపాధి పోయింది. ఉన్న కొడుకుల్లో ఒక కొడుకు దివ్యాంగుడు. భర్తకు ఎలాంటి ఉపాధి లేకపోవడంతో బాలరాజ్ భార్య, చిన్న కొడుకును తీసుకొని పెద్ద కొడుకుని భర్త దగ్గరే వదిలేసి పుట్టింటికి వెళ్లిపోయింది.
దీంతో తన పెద్ద కొడుకును చూసుకోవడం కోసం హోటల్ లో పని చేయడం మొదలు పెట్టాడు. కానీ.. ఇటీవల పెద్ద కొడుకు అయిన 8 ఏళ్ల హరీశ్ కు తీవ్ర అనారోగ్యం రావడంతో ట్రీట్ మెంట్ చేయించేందుకు డబ్బులు కూడా లేకపోవడంతో హరీశ్ ఇటీవల మృతి చెందాడు.
హరీశ్ మృతదేహానికి అంత్యక్రియలు చేసేందుకు తన దగ్గర రూపాయి కూడా లేకపోవడంతో స్మశానానికి బాడీని తీసుకెళ్లి అక్కడే కూర్చొని 8 గంటల పాటు ఏడుస్తూ కూర్చున్నాడు బాలరాజ్. కొడుకు బతికి ఉన్నప్పుడు తిండి పెట్టలేకపోయాను.. కనీసం చనిపోయాక అంత్యక్రియలు కూడా చేయలేకపోతున్నాను అని కంటతడి పెట్టాడు.
ఈ విషయం తెలుసుకున్న ఓ ఫౌండేషన్ సభ్యులు అక్కడికి చేరుకొని ఆ బాబుకి అంత్యక్రియలు నిర్వహించారు. ఈ ఘటన స్థానికంగా అందరినీ కంటతడి పెట్టించింది.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
