Delhi Car Blast : ఈ నెల 10వ తేదీన సాయంత్రం ఢిల్లీలోని రెడ్ ఫోర్ట్ వద్ద జరిగిన కారు బాంబు పేలుడు ధాటికి పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మరికొంతమంది గాయపడ్డారు. వాళ్లకు చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిని ప్రధాని మోదీ కూడా పరామర్శించారు. మరోవైపు ఈ కారు బాంబు పేలుడు ఒక సూసైడ్ మిషన్ గా పోలీసులు గుర్తించారు. ఇది ఖచ్చితంగా ఉగ్రవాద చర్యే అని కేంద్రం ప్రకటించింది. దేశవ్యాప్తంగా ఉగ్రదాడి చేసేందుకు ప్లాన్ చేసిన పలువురు ఉగ్రవాదులను పోలీసులు ఇప్పటికే అదుపులో తీసుకొని విచారిస్తున్నారు.
అయితే.. ఎర్రకోట వద్ద సిగ్నల్ పడటంతో వాహనాలన్నీ ఆగిపోయాయి. సిగ్నల్ కోసం వేచి చూస్తున్నాయి. ఇంతలో ఆ సిగ్నల్ లో వాహనాల మధ్యలో ఉన్న కారు ఒక్కసారిగా పేలింది. పేలుడు ధాటికి పక్కనే ఉన్న చాలా వాహనాలు దెబ్బతిన్నాయి. ఆ కారుకు సమీపంలో ఉన్న వారిలో 12 మంది మృతి చెందారు. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
