WhatsApp
Advertisement

Bomb Blast in Pakistan : పాకిస్థాన్‌లో బాంబు పేలుడు.. 12 మంది మృతి

Bomb Blast in Pakistan : నిన్న ఢిల్లీలో జరిగిన బాంబ్ బ్లాస్ట్ ను మరవకముందే అదే తరహాలో పాకిస్థాన్ లోనూ బాంబు పేలుడు సంభవించింది. ఇస్లామాబాద్ జిల్లా కోర్టు దగ్గర్లో పార్క్ చేసి ఉన్న కారులో పేలుడు సంభవించింది. కారులో గ్యాస్ సిలిండర్ పెట్టి పేల్చినట్టుగా పోలీసులు గుర్తించారు. మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ పేలుడు ధాటికి 12 మంది మరణించగా, 20 మందికి పైగా గాయపడ్డారు. కోర్టుకు సమీపంలో కావడంతో మృతులు, గాయపడిన వారు ఎక్కువగా కోర్టులో పనిచేసే సిబ్బందే ఉన్నారు.

https://twitter.com/sardarsammadkh1/status/1988158004840329505
Advertisement