Car Accident : ఈ మధ్య రోడ్డు ప్రమాదాలు ఎక్కువవుతున్నాయి. వరుస ప్రమాదాలతో ఏం చేయాలో తెలియక ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం చేస్తున్నారు. ఎక్కడికైనా వెళ్లాలంటేనే వణుకు పుడుతోంది. కారు అయినా, బస్సు అయినా, ఆటో అయినా, బైక్ అయినా, ఏ విధంగా వెళ్లినా ప్రమాదాలు మాత్రం రాకుండా ఉండటం లేదు. తాజాగా హైదరాబాద్ – విజయవాడ హైవేపై రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.
డివైడర్ ను ఢీకొట్టిన కారు పల్టీలు కొట్టింది. అనంతరం ఇంజిన్ కు మంటలు అంటుకోవడంతో క్షణాల్లో కారు కాలి బూడిదైపోయింది. కారుకు మంటలు అంటుకోగానే కారులో ఉన్న 8 మంది ప్రయాణికులు వెంటనే బయటికి రావడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. ఈ ఘటన నల్గొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి సమీపంలో చోటు చేసుకుంది. అతి వేగంతో వెళ్లి డివైడర్ ను ఢీకొట్టడం వల్లనే కారుకు మంటలు అంటుకున్నట్టు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
