Advertisement

ఉపాధ్యాయురాలి వివాదం.. కాళ్లు నొక్కించుకున్న ఘటన కలకలం

మన పత్రిక, వెబ్​డెస్క్: శ్రీకాకుళం జిల్లా మెళియాపుట్టి మండలం బందపల్లి బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో ఓ మహిళా ఉపాధ్యాయురాలి ప్రవర్తన చర్చనీయాంశంగా మారింది. విద్యార్థినులతో కాళ్లు నొక్కించుకుంటూ మొబైల్‌ ఫోన్‌లో మాట్లాడుతున్న వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటన స్థానికంగా ఆగ్రహం రేపగా, విద్యా శాఖ అధికారులు వెంటనే స్పందించారు.

అధికారులు సంబంధిత ఉపాధ్యాయురాలికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, విచారణకు ఆదేశించారు. ఘటనపై పూర్తి వివరాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

Advertisement

Advertisement