మన పత్రిక, వెబ్డెస్క్: Collector Nizamabad | నిజామాబాద్ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల (Purchasing Center) నిర్వహణలో నిర్లక్ష్యంపై కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి (Collector Vinay Krishna Reddy) అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం నవీపేట, రెంజల్ మండలాల్లోని పలు కొనుగోలు కేంద్రాలను ఆయన ఆకస్మికంగా సందర్శించారు.
రెంజల్ మండలం వీరన్నగుట్ట కేంద్రంలో ధాన్యాన్ని నిర్దేశిత మిల్లుకు కాకుండా వేరే మిల్లుకు తరలించడం, ట్యాబ్ ఎంట్రీలలో జాప్యం జరగడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. పర్యవేక్షణలో అలసత్వం వహించిన రెంజల్ మండల వ్యవసాయ అధికారికి షోకాజ్ నోటీసు జారీ చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. తుఫాన్ వర్షానికి తడిసిన ధాన్యాన్ని పరిశీలించిన కలెక్టర్, 17 శాతానికి లోబడి తేమ ఉన్న ధాన్యాన్ని వెంటనే తూకం వేయాలని సూచించారు. రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా టార్పాలిన్లు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
