Advertisement

Cyclone Montha: ఏపీకి భారీ ముప్పు.. 3 రాష్ట్రాల్లో హై అలర్ట్!

మన పత్రిక, వెబ్​డెస్క్: తుఫాను ప్రభావంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌కు ముప్పు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. రాష్ట్రంలోని తీర ప్రాంతాల వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. విశాఖపట్నంలో భీకర గాలులతో కుండపోత వర్షం కురుస్తున్నట్లు సమాచారం.

సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారింది. నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు తీరం వెంబడి 8 నుంచి 10 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగసిపడుతున్నాయి. కొన్ని చోట్ల అలల ఎత్తు 2 నుండి 4.7 మీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని IMD అధికారులు తెలిపారు. తీరప్రాంత ఆంధ్రప్రదేశ్‌లోని చాలా ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి.

Advertisement

మరోవైపు, మొంథా తుఫాను ప్రభావం తెలంగాణపై కూడా పడే అవకాశం ఉంది. దీని కారణంగా అధికారులు రాష్ట్రంలోని పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్ జారీ చేశారు. మరో 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించి, భారీ వర్ష సూచన చేశారు.v

Advertisement