మన పత్రిక, వెబ్డెస్క్: తుఫాను ప్రభావంతో ఇప్పటికే పలు ప్రాంతాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్కు ముప్పు ఎక్కువగా ఉన్నట్లు వాతావరణ శాఖ (IMD) హెచ్చరించింది. రాష్ట్రంలోని తీర ప్రాంతాల వెంబడి గంటకు 60 నుంచి 70 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తున్నాయి. విశాఖపట్నంలో భీకర గాలులతో కుండపోత వర్షం కురుస్తున్నట్లు సమాచారం.
సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారింది. నెల్లూరు నుండి శ్రీకాకుళం వరకు తీరం వెంబడి 8 నుంచి 10 అడుగుల ఎత్తు వరకు అలలు ఎగసిపడుతున్నాయి. కొన్ని చోట్ల అలల ఎత్తు 2 నుండి 4.7 మీటర్ల వరకు ఉండే అవకాశం ఉందని IMD అధికారులు తెలిపారు. తీరప్రాంత ఆంధ్రప్రదేశ్లోని చాలా ప్రాంతాలలో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు, కొన్ని చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. ఈ నేపథ్యంలో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని రాష్ట్ర ప్రభుత్వాలు హెచ్చరికలు జారీ చేశాయి.
మరోవైపు, మొంథా తుఫాను ప్రభావం తెలంగాణపై కూడా పడే అవకాశం ఉంది. దీని కారణంగా అధికారులు రాష్ట్రంలోని పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేశారు. మరో 21 జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించి, భారీ వర్ష సూచన చేశారు.v
ఇవి కూడా చదవండి :
- తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్: జూన్ నెల దర్శన, గదుల కోటా విడుదల తేదీలు ఇవే
- మార్చి 19న గేట్ 2026 ఫలితాలు: ప్రకటించిన ఐఐటీ గువహాటి
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
