Advertisement

Andhra News: తండ్రీ కుమారులు ఒకే పాఠశాలలో ఉపాధ్యాయులు

Bobbili News: బొబ్బిలి పట్టణంలోని గొల్లపల్లి వేణుగోపాల పురపాలక ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న బంకురు రామకృష్ణ కుమారుడు రాకేష్, మెగా డిఎస్సీలో సెలెక్ట్ అయ్యి అదే పాఠశాలలో అదే సబ్జెక్టు (ఆంగ్లం) ఉపాధ్యాయుడిగా ఎంపిక అయ్యాడు. తండ్రీ కుమారులు ఒకే పాఠశాలలో, ఒకే సబ్జెక్టులో బోధించడం ఇదే మొట్టమొదటిసారి.

ఇది కేవలం ఉద్యోగ ఎంపిక కాదు – ఒక కుటుంబ కల నిజమైన చిన్న చరిత్ర. రామకృష్ణ ప్రస్తుతం పాఠశాలలో అనుభవజ్ఞుడిగా ఉండగా, రాకేష్ కొత్త తరం ఉపాధ్యాయుడిగా వచ్చి విద్యారంగంలో కొత్త శక్తిని నింపుతున్నాడు. విద్యార్థులకు ఇద్దరూ ఒకే సబ్జెక్టులో వివిధ దృష్టికోణాలు అందించనున్నారు.

Advertisement
Advertisement