Advertisement

యూపీఐ ద్వారా స్కూల్‌ ఫీజు చెల్లింపు

దేశంలో యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (UPI) వినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో, పాఠశాలల్లో ఫీజుల వసూలు ప్రక్రియను ఆధునికీకరించాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది. అడ్మిషన్లు, పరీక్షా ఫీజులు సహా స్కూళ్లకు సంబంధించిన అన్ని రకాల లావాదేవీలకు యూపీఐ (UPI), మొబైల్‌ పేమెంట్ల వంటి డిజిటల్ విధానాలను తప్పనిసరిగా అమలు చేయాలని కేంద్ర విద్యాశాఖ రాష్ట్రాలు, సంబంధిత విభాగాలకు తాజాగా లేఖలు రాసింది. ఈ ఆదేశాల పరిధిలోకి సీబీఎస్‌ఈ (CBSE), కేంద్రీయ విద్యాలయాలు, నవోదయ విద్యాలయాల వంటి ప్రముఖ విద్యా సంస్థలు వస్తాయి. తద్వారా ఫీజు చెల్లింపు ప్రక్రియ మరింత సులభతరం, పారదర్శకంగా మారుతుందని ప్రభుత్వం పేర్కొంది.

Advertisement
Advertisement