తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలల్లో ప్రస్తుతం 1,20,000 టీచర్ పోస్టులు ఉన్నాయి. దీనిలో 1,07,000 మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. మిగిలిన 13 వేల పోస్టులు ఖాళీగా ఉన్నట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయి. ఈ ఖాళీలకు కారణాలు పలురకాలు. కొందరు ఉపాధ్యాయులకు పదోన్నతులు రావడం, మరికొందరు పదవీ విరమణ పొందడం వల్ల ఖాళీల సంఖ్య పెరిగింది.
ఇటీవల ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా డీఎస్సీ నోటిఫికేషన్ త్వరలో విడుదల చేస్తామని ప్రకటించారు. ఇది ఉద్యోగార్థులకు ఆశ కలిగించింది. ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరం 1000కి పైగా ఫ్రీ ప్రైమరీ పాఠశాలలను మంజూరు చేసింది. వీటిలో శాశ్వత ఉపాధ్యాయులను నియమిస్తే, మరో 2 వేల పోస్టులు పెరిగే అవకాశం ఉంది.
ఇది ఉపాధ్యాయులకు గుడ్ న్యూస్. ప్రభుత్వం త్వరలో నోటిఫికేషన్ జారీ చేస్తే, లక్షల అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి :
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
- బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష
- ఇరాన్ క్షిపణి దాడులు: దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేత
