Advertisement

PM Modi GST Utsav | 5% GST మాత్రమే! మోడీ ప్రభుత్వం కొత్త ప్రకటన

జీఎస్టీలో రెండు స్లాబులు మాత్రమే: 5%, 18%
ఇకపై జీఎస్టీ పన్ను విధానం చాలా సరళంగా ఉండబోతోంది. కేంద్రం ప్రకటించిన కొత్త నిర్ణయం ప్రకారం, దేశంలో కేవలం 5% మరియు 18% అనే రెండు పన్ను స్లాబులు మాత్రమే ఉంటాయి. ఇది పన్ను వ్యవస్థను పూర్తిగా మార్చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రజలు ఇప్పటికే ఉపయోగిస్తున్న 99 నిత్యావసర వస్తువులు ఇప్పుడు 5% జీఎస్టీ పరిధిలోకి వచ్చాయి.

ఆరోగ్యం, బీమా, ఔషధాలపై భారం తగ్గనుంది
ఈ సంస్కరణల వల్ల హెల్త్ ఇన్సూరెన్స్, మెడిసిన్ ధరలు గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. ప్రజలపై ఆర్థిక భారం తగ్గడంతో పాటు, కొనుగోలు శక్తి పెరగనుంది. దీంతో ప్రపంచంలోనే అతిపెద్ద వినియోగదారుల మార్కెట్‌గా భారత్ మరింత ఆకర్షణీయంగా మారుతుంది. బహుళజాతి సంస్థలు కూడా ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాయి.

Advertisement

ప్రజలకు బహుమతిగా జీఎస్టీ మార్పులు?
పన్నుల భారం నుంచి ప్రజలకు ఉపశమనం ఇవ్వడమే లక్ష్యంగా ఈ మార్పులు తీసుకురావడం జరిగింది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం బీహార్ ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన బహుమతిగా కూడా ఈ నిర్ణయాన్ని చూస్తున్నారు విశ్లేషకులు.

ఇంకా వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి

Advertisement