ఎస్బీఐ ఫౌండేషన్ ( SBI Foundation )పేద కానీ ప్రతిభావంతులైన విద్యార్థుల కలలను నెరవేర్చేందుకు ప్లాటినమ్ జూబ్లీ ఆశా స్కాలర్షిప్ 2025 ( Platinum Jubilee Asha Scholarship 2025 ) ప్రకటించింది. దేశవ్యాప్తంగా 23,230 మంది విద్యార్థులకు ఈ స్కాలర్షిప్ అందజేయనుంది. తొమ్మిదో తరగతి నుంచి పోస్టు గ్రాడ్యుయేషన్ వరకు చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ స్కాలర్షిప్ కింద విద్యార్థి కోర్సు మరియు స్థాయి బట్టి ఏటా రూ.15 వేల నుంచి రూ.20 లక్షల వరకు ఆర్థిక సహాయం అందిస్తారు. స్కాలర్షిప్ ప్రతి సంవత్సరం పునరుద్ధరణ కోసం కనీస మార్కులు లేదా CGPA పాటించాలి.
అర్హతలు: గత సంవత్సరంలో 75% మార్కులు లేదా 7 CGPA ఉండాలి. SC/ST విద్యార్థులకు 67.5% మార్కులు లేదా 6.30 CGPA తగినది. కుటుంబ వార్షిక ఆదాయం స్కూల్ విద్యార్థులకు రూ.3 లక్షలు, ఇతరులకు రూ.6 లక్షలు మించకూడదు.
ఐఐటీ, ఐఐఎం, వైద్యం, ఓవర్సీస్ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అప్లికేషన్ నవంబర్ 15, 2025 వరకు www.sbiashacholarship.co.in లో సమర్పించాలి.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
