Advertisement

రవితేజ ‘ఇరుముడి’లో రామ్ చరణ్ మెరవనున్నారా? ప్రచారంలో నిజం లేదన్న తాజా

మన పత్రిక: కథానాయకుడు రవితేజ నటిస్తున్న ‘ఇరుముడి’ సినిమాలోని ‘మల్లెపూల పల్లకి’ పాటలో గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రత్యేక అతిథి పాత్రలో మెరవనున్నారంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగింది. అయితే ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని తాజా సమాచారం స్పష్టం చేసింది. ఈ పాటలో రామ్ చరణ్ ఎలాంటి అతిథి పాత్ర చేయలేదని, ఈ ప్రచారం కేవలం పుకారు మాత్రమేనని వెల్లడైంది.

ఈ చిత్రంలో రవితేజ సరసన ప్రియా భవానీ శంకర్, నక్షత్ర నటిస్తుండగా సాయి కుమార్, అజయ్ ఘోష్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ ఈ నిర్మిస్తుండగా, జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. ‘ఇరుముడి’ సినిమా తెలుగు, తమిళ భాషల్లో 2026 ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement
Advertisement