Advertisement

రేపటి నుంచి ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం ప్రారంభం

మన పత్రిక: రేపటి నుంచి ‘ఇంటింటికి తెలుగుదేశం’ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నట్లు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. ఎన్డీయే ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సాధించిన విజయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ఈ ప్రచారాన్ని చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం మొత్తం 45 రోజుల పాటు కొనసాగుతుందని పేర్కొన్నారు.

ఈ ప్రచారంలో భాగంగా సూపర్-6 హామీల అమలు తీరును ప్రజలకు వివరిస్తామని చెప్పారు. గత ప్రభుత్వ పాలనకు, ప్రస్తుత ఎన్డీయే ప్రభుత్వ పాలనకు మధ్య ఉన్న తేడాలను ప్రజలకు స్పష్టంగా వివరించాలని పార్టీ శ్రేణులకు ఆయన పిలుపునిచ్చారు. అంతేకాకుండా, ఈ ఇంటింటి ప్రచారంలో ప్రజల సమస్యలను, వారి సూచనలను ప్రత్యక్షంగా స్వీకరించనున్నట్లు వెల్లడించారు.

Advertisement
Advertisement