మన పత్రిక: టీమిండియా టి20 కెప్టెన్గా శ్రేయస్ అయ్యర్ ప్రదర్శన తీవ్ర నిరాశకు గురి చేస్తోంది. అంతర్జాతీయ క్రికెట్లో జట్టు వరుస పరాజయాలను మూటగట్టుకోవడంతో, అయ్యర్ కెప్టెన్సీ సామర్థ్యంపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ముఖ్యంగా ఇంగ్లాండ్ గడ్డపై జరిగిన టి20 సిరీస్తో పాటు, ఐర్లాండ్ చేతిలో టీమిండియా ఓడిపోవడం అభిమానులను కలవరపెడుతోంది. ఐర్లాండ్ వంటి జట్టు చేతిలో వైట్ వాష్కు గురికావడం భారత క్రికెట్ చరిత్రలో ఒక చేదు అనుభవంగా నిలిచింది.
వైఫల్యాల బాటలో కెప్టెన్సీ
గతంలో సూర్య కుమార్ యాదవ్ నాయకత్వంలో టీమిండియా దక్షిణాఫ్రికా, ఆస్ట్రేలియా జట్లపై సిరీస్ విజయాలు సాధించడమే కాకుండా, టి20 వరల్డ్ కప్ను కూడా గెలుచుకుంది. అటువంటి కెప్టెన్ను పక్కనపెట్టి, శ్రేయస్ అయ్యర్కు బాధ్యతలు అప్పగించడంపై మేనేజ్మెంట్ నిర్ణయంపై విమర్శలు వస్తున్నాయి. కేవలం ఐపీఎల్ లీగ్ టోర్నీలలో కోల్కతా, పంజాబ్ జట్ల కోసం చేసిన ప్రదర్శనను ప్రాతిపదికగా తీసుకుని, అతడిని అంతర్జాతీయ జట్టుకు కెప్టెన్గా ఎంపిక చేయడం సరికాదని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇంగ్లాండ్తో జరిగిన వన్డే సిరీస్ నిర్ణయాత్మక మ్యాచ్లో కూడా శ్రేయస్ అయ్యర్ బాధ్యతారహితంగా బ్యాటింగ్ చేసి పెవిలియన్ చేరారు. తాను గుణపాఠం నేర్చుకున్నానని చెబుతున్నప్పటికీ, మైదానంలో ఆ ఫలితాలు కనిపించడం లేదని విమర్శలు వినిపిస్తున్నాయి. జట్టు ప్రయోజనాల కంటే ఏదీ గొప్ప కాదని, వైఫల్యాలు కొనసాగుతుంటే అయ్యర్ తన సారథ్య బాధ్యతలను వదులుకోవాలని అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Rajendar Degavath has three years of experience in content writing across education, employment, politics, technology, entertainment, and current affairs. He focuses on creating reliable, reader-friendly stories that explain important topics in simple language.
ఇవి కూడా చదవండి :
- దక్షిణాది ఎథనాల్ పరిశ్రమలను కాపాడాలని కేంద్రానికి రాజ్యసభ సభ్యుని విజ్ఞప్తి
- సిరిసిల్లలో యువకుడి ఆత్మహత్య, సూసైడ్ నోట్లో ప్రధాని మోడీ పేరు
- ఢిల్లీలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్తో భేటీ అయిన ముఖ్యమంత్రి చంద్రబాబు
- రాజకీయ సందేశాలతో అలరిస్తున్న విజయ్ ‘జన నాయగన్’ చిత్రం
- ఢిల్లీ నిరసనలు, నీట్ వివాదంపై ప్రధాని మోదీకి అన్నా హజారే లేఖ
