మన పత్రిక: సింగూరు ప్రాజెక్టు నుంచి ఉమ్మడి పుల్కల్ మండలంలోని 45 గ్రామాలకు అందుతున్న తాగునీటి సరఫరా అక్టోబర్ చివరి వరకు మాత్రమే కొనసాగే అవకాశం ఉందని ఆర్డబ్ల్యూఎస్ ఏఈ నాగసాయి తెలిపారు. ఆ తర్వాత నీటి సరఫరా నిలిచిపోయే అవకాశం ఉన్నందున, గ్రామ పంచాయతీలు ముందుస్తుగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసుకోవాలని ఆయన సూచించారు. గ్రామాల్లో ఇప్పటికే ఉన్న బోరు బావులను వెంటనే మరమ్మతులు చేయించి, వినియోగంలోకి తీసుకురావాలని సర్పంచులు, పంచాయతీ అధికారులను ఆయన కోరారు.
ప్రత్యామ్నాయ వనరులపై దృష్టి
మరమ్మతులకు వీలుపడని బోరు బావుల స్థానంలో, అవసరమైతే కొత్తగా బోర్లు వేయించి తాగునీటి కొరత తలెత్తకుండా చూడాలని నాగసాయి ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నిరంతర తాగునీటి సరఫరా అందించడం గ్రామ పంచాయతీల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. సర్పంచులు, పంచాయతీ కార్యదర్శులు సమన్వయంతో పనిచేసి బోరు బావుల పునరుద్ధరణ మరియు కొత్త బోర్ల ఏర్పాటుపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన సూచించారు.

Farooq Basha is a content writer with two years of experience covering education, jobs, politics, technology, entertainment, and current affairs. He writes clear, accurate, and easy-to-understand articles for everyday readers.
