Chandrababu naidu new helicopter: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ( Andhrapradesh Government ) ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (Chandrababu Naidu ) భద్రత దృష్ట్యా కొత్త హెలికాప్టర్ను అందుబాటులోకి తెచ్చింది. గత రెండు వారాలుగా సీఎం జిల్లాల పర్యటనలకు ఈ హెలికాప్టర్ను ఉపయోగిస్తున్నారు. పాత బెల్ హెలికాప్టర్ కు బదులుగా ఎయిర్ బస్ హెచ్-160 మోడల్ హెలికాప్టర్ ను ఎంపిక చేశారు. ఈ హెలికాప్టర్ అధునాతన ఫీచర్లతో కూడినది. ప్రతికూల పరిస్థితుల్లో కూడా సురక్షితంగా ప్రయాణించవచ్చు. ఇందులో పైలట్లతో పాటు ఆరుగురు ప్రయాణించవచ్చు. ఇది సమయం, ఆర్థిక వనరుల రెండింటినీ ఆదా చేస్తుంది.
ఇంతకు ముందు సీఎం ఉండవల్లి నివాసం నుంచి గన్నవరం విమానాశ్రయానికి వెళ్లి, అక్కడ నుంచి ప్రత్యేక విమానంలో గమ్యానికి చేరుకునేవారు. ఇప్పుడు నేరుగా హెలికాప్టర్ లో జిల్లాలకు వెళ్తున్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాప్టర్ ప్రమాదం తర్వాత సీఎం పర్యటనలపై ప్రత్యేక భద్రతా చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే కొత్త హెలికాప్టర్ అందుబాటులోకి రావడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
