మన పత్రిక, న్యూఢిల్లీ: సీబీఎస్ఈ 12వ తరగతి బోర్డు పరీక్షల ఫలితాలు వెలువడేందుకు సర్వం సిద్ధమైంది. డిజీలాకర్ పోర్టల్లో మే 10న “ఫలితాలు త్వరలో” (Results Soon) అనే నోటీసు దర్శనమివ్వడంతో ఏ క్షణమైనా మార్కులు విడుదలయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
గత ట్రెండ్ను బట్టి మే 11 నుంచి 20వ తేదీ లోపు ఈ ఫలితాలు వెల్లడయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి. విద్యార్థులు తమ రోల్ నంబర్, స్కూల్ కోడ్, అడ్మిట్ కార్డ్ ఐడీ వివరాలను నమోదు చేసి డిజీలాకర్, సీబీఎస్ఈ అధికారిక వెబ్సైట్లలో తమ మార్కులను సులభంగా సరిచూసుకోవచ్చు.
మరోవైపు, విద్యార్థుల మానసిక ఆరోగ్యం కోసం దిల్లీ ఎయిమ్స్ సైకియాట్రీ విభాగంతో కలిసి ‘ప్రాజెక్ట్ మేట్’ రెండో దశను సీబీఎస్ఈ అధికారికంగా ప్రారంభించింది. చైర్పర్సన్ రాహుల్ సింగ్ పర్యవేక్షణలో దిల్లీ-ఎన్సీఆర్ పరిధిలోని 60కి పైగా పాఠశాలల్లో ఈ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇందులో ‘మేట్-5 సర్కిల్’ విధానం ద్వారా విద్యార్థులు ఒకరికొకరు తోడ్పడేలా చేయడంతో పాటు, తల్లిదండ్రుల కోసం ప్రత్యేక వర్క్షాపులు నిర్వహిస్తారు.
ఇవి కూడా చదవండి :
- హైదరాబాద్లో పడిపోయిన రియల్ ఎస్టేట్: కొనుగోలుదారులు లేక ఖాళీగా ఫ్లాట్లు
- Petrol Diesel price hike : మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: దిల్లీలో రూ. 100 దాటిన రేటు
- నేటితో ముగియనున్న టీజీ దోస్త్ సెకండ్ ఫేజ్ రిజిస్ట్రేషన్ల గడువు
- తెలంగాణలో తొలి గాజు వంతెన.. హుస్నాబాద్లో ముమ్మరంగా పనులు
- బండ్లగూడలో తప్పిపోయిన నాలుగేళ్ల చిన్నారి గుర్తింపు..
