మన పత్రిక వెబ్డెస్క్, అమరావతి: సంక్రాంతి పండుగ వేళ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కు శుభవార్త చెప్పింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రాష్ట్ర వైద్యారోగ్య రంగానికి ఐదవ మరియు చివరి విడతగా రూ. 567.40 కోట్ల గ్రాంట్ను విడుదల చేసింది. ఈ విషయాన్ని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఓ ప్రకటనలో వెల్లడించారు. తాజా నిధులతో కలిపి రాష్ట్రం మొత్తం రూ. 2,600 కోట్ల గ్రాంట్ను పూర్తిస్థాయిలో సాధించిందని మంత్రి తెలిపారు.
నిధుల కేటాయింపు ఇలా.. విడుదలైన ఈ నిధులను ప్రధానంగా ఆయుష్మాన్ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక (PHC), సామాజిక ఆరోగ్య కేంద్రాల (CHC) భవన నిర్మాణాలు, డయాగ్నోస్టిక్ సేవల మెరుగుదలకు వినియోగించనున్నారు.
Advertisement
- రూ. 233.45 కోట్లు: ఆయుష్మాన్ మందిరాలు, పీహెచ్సీ, సీహెచ్సీ భవనాలకు.
- రూ. 218.11 కోట్లు: వ్యాధి నిర్ధారణ పరీక్షల మౌలిక సదుపాయాలకు.
- రూ. 55.89 కోట్లు: గ్రామీణ హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లకు.
- రూ. 52.71 కోట్లు: పట్టణ ఆరోగ్య సేవలకు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిధుల వినియోగం వేగవంతమైందని, 19 నెలల్లోనే 43% నిధులు సాధించామని అధికారులు మంత్రికి వివరించారు.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
