మన పత్రిక, వెబ్డెస్క్ : మెదక్ జిల్లా రామాయంపేటలో భారీ వర్షాల కారణంగా నీట మునిగిన గురుకుల డిగ్రీ కళాశాలలో చిక్కుకున్న 300 మంది విద్యార్థులను రెస్క్యూ టీమ్ సురక్షితంగా కాపాడింది. ఈ కళాశాల ఎస్సీ మహిళా డిగ్రీ కళాశాలగా కూడా పనిచేస్తోంది.
Medak gurukul degree college rescue news
నీటి మట్టం పెరగడంతో విద్యార్థులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు సమాచారం ఇవ్వడంతో వెంటనే రెస్క్యూ బృందాలు సంఘటనా స్థలానికి చేరుకున్నాయి. బోట్ల సాయంతో విద్యార్థులను సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఈ ప్రాంతంలో వర్షాలు ఇంకా కురుస్తూనే ఉన్నాయి. ముంపు ప్రాంతాల్లో అధికారులు అప్రమత్తంగా ఉన్నారు. సహాయక చర్యలు సాగుతున్నాయి. ప్రజలు ఇళ్లలోనే ఉండి భద్రత పాటించాలని అధికారులు సూచిస్తున్నారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
Advertisement
