మన పత్రిక, వెబ్డెస్క్: పసిడి ధర నిన్నటితో పోలిస్తే సోమవారం (అక్టోబర్ 27) భారీగా తగ్గింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,25,620 పలకగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,15,150 వద్ద ఉంది. బంగారంతో పాటు వెండి ధర కూడా భారీగా తగ్గింది. కేజీ వెండి ధర రూ. 1,54,000కి చేరుకుంది.
Advertisement
అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తగ్గడం, డాలర్ విలువ పుంజుకోవడమే ఈ తగ్గుదలకు ప్రధాన కారణమని నిపుణులు పేర్కొంటున్నారు. డాలర్ గడచిన వారం రోజులుగా చక్కటి రికవరీ సాధించింది. దీనికి తోడు దేశీయ మార్కెట్లో ఆభరణాల డిమాండ్ తగ్గడం కూడా ధరలపై ప్రభావం చూపింది.
Advertisement
గత తొమ్మిది వారాలుగా పెరిగిన ధరలు ఈ వారం తగ్గుముఖం పట్టినా, ఇది కేవలం ‘టెక్నికల్ కరెక్షన్’ మాత్రమేనని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
► Read latest
Telugu News
► Follow us on
WhatsApp
&
Google News
Advertisement
Advertisement
Advertisement

