Advertisement

1,803 పీఈటీ పోస్టులు – తెలంగాణ ప్రభుత్వానికి విద్యాశాఖ ప్రతిపాదన

తెలంగాణ రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు, ప్రభుత్వ హైస్కూళ్లలో 1,803 మంది పీఈటీలు (Physical Education Teachers) అవసరమని గుర్తించి, ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.

రాష్ట్రంలో 4,701 హైస్కూళ్లు ఉన్నాయి. వాటిలో 1,803 చోట్ల పీఈటీలు లేరు. దీనిని దృష్టిలో ఉంచుకుని, ప్రాధమిక పాఠశాలల్లో ఎక్కువగా ఉన్న ఎస్జీటీ పోస్టులను తగ్గించి, ఆ మేరకు కొత్తగా 1,803 పీఈటీ పోస్టులను మంజూరు చేయాలని అధికారులు సూచించారు.

Advertisement

అదే సమయంలో, 260 హైస్కూళ్లకు ప్రధానోపాధ్యాయుల పోస్టులు ఇవ్వలేదు. వాటికి కూడా ఎస్జీటీ పోస్టులను తగ్గించి, హెచ్ఎం పోస్టులను మంజూరు చేయాలని కోరారు.

Advertisement