YS Jagan : ఏపీలో ఉన్న ప్రభుత్వం చేస్తున్న తీరు చూసి రాష్ట్ర ప్రజలకు భ్రమలు తొలిగిపోయాయని, వీళ్లకు కేవలం సొంత ఆదాయాలు ఎలా పెంచుకోవాలి అనే దాని మీద తప్ప వేరే వాటి మీద లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.
దోచుకో, పంచుకో, తినుకో.. ఇదే ఏపీ ప్రభుత్వ నినాదం అని జగన్ దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన ఈసందర్భంగా మాట్లాడారు. జగన్ మాట్లాడిన వీడియోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
Advertisement
ఎక్కడ చూసినా దోపిడీనే, అర్ధరూపాయికి, పావలాకు భూములు పంచిపెడుతున్నారని జగన్ మండిపడ్డారు. లిక్కర్ తయారీ చేసే కంపెనీలు తమ ప్రభుత్వంలో ఎలా లిక్వర్ తయారు చేసేది, ఇప్పుడు ఎలా తయారు చేస్తున్నారు. ప్రైవేట్ లిక్వర్ షాప్స్ అయితే మాఫియా తరహాలో కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
