YS Jagan : ఏపీలో ఉన్న ప్రభుత్వం చేస్తున్న తీరు చూసి రాష్ట్ర ప్రజలకు భ్రమలు తొలిగిపోయాయని, వీళ్లకు కేవలం సొంత ఆదాయాలు ఎలా పెంచుకోవాలి అనే దాని మీద తప్ప వేరే వాటి మీద లేదని వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు.
దోచుకో, పంచుకో, తినుకో.. ఇదే ఏపీ ప్రభుత్వ నినాదం అని జగన్ దుయ్యబట్టారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలతో జరిగిన సమావేశంలో ఆయన ఈసందర్భంగా మాట్లాడారు. జగన్ మాట్లాడిన వీడియోను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎక్స్ వేదికగా షేర్ చేశారు.
Advertisement
ఎక్కడ చూసినా దోపిడీనే, అర్ధరూపాయికి, పావలాకు భూములు పంచిపెడుతున్నారని జగన్ మండిపడ్డారు. లిక్కర్ తయారీ చేసే కంపెనీలు తమ ప్రభుత్వంలో ఎలా లిక్వర్ తయారు చేసేది, ఇప్పుడు ఎలా తయారు చేస్తున్నారు. ప్రైవేట్ లిక్వర్ షాప్స్ అయితే మాఫియా తరహాలో కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
Advertisement
