Advertisement

వైసీపీ పాలనలోనే నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగింది: ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావు

మన పత్రిక: గత వైసీపీ పాలనలో అర్హులైన నిరుద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని టీడీపీ ఎమ్మెల్యే Yeluri Sambasiva Rao ఆరోపించారు. జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో అర్హులైన అభ్యర్థుల చేతిలో హాల్ టికెట్లు మాత్రమే మిగిలిపోయాయని, అనర్హులకు నియమాక పత్రాలు అందాయని ఆయన విమర్శించారు. నిరుద్యోగంపై మాట్లాడే అర్హత వైసీపీకి లేదని స్పష్టం చేశారు.

వైసీపీ పాలనలో యువత భవిష్యత్తు నాశనమైందని ఏలూరి సాంబశివరావు ఆందోళన వ్యక్తం చేశారు. ఆ కాలంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల సమాధాన పత్రాలను వంటవాళ్లతో దిద్దించారని ఆయన ఆరోపించారు. కాగా, ప్రస్తుతం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఉద్యోగాల భర్తీ ప్రక్రియను అత్యంత పారదర్శకంగా చేపడుతోందని పేర్కొన్నారు.

Advertisement
Advertisement