Xiaomi 17 Series : షియోమీ ఫోన్లకు భారత్ లో ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. షియోమీ సిరీస్ అంటే అడ్వాన్స్డ్ ఫీచర్లతో బడ్జెట్ ధరలో అందుబాటులో ఉంటాయి. అందుకే ఈ సిరీస్ ఫోన్ల కోసం స్మార్ట్ ఫోన్ అభిమానులు తెగ ఎదురు చూస్తుంటారు. షియోమీ నుంచి సరికొత్త సిరీస్ అయిన 17 ఇప్పటికే చైనాలో రిలీజ్ అయింది కానీ.. భారత్ లో మాత్రం రిలీజ్ కాలేదు.
17 సిరీస్ లో భాగంగా 17, 17 ప్రో, 17 ప్రో మ్యాక్స్ ఈ మూడు మోడల్స్ చైనాలో విడుదలయ్యాయి. ఇందులో స్నాప్ డ్రాగన్ 8 ఎలైట్ జనరేషన్ 5 చిప్ సెట్, 6.9 ఇంచ్ 2కే ఓఎల్ఈడీ డిస్ ప్లే, అల్ట్రాసోనిక్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, 50 ఎంపీ మెయిన్ సెన్సార్, ఆండ్రాయిడ్ 16 లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ అయింది. అయితే.. భారత్ లో ఈ సిరీస్ మార్చి 2026 లో రిలీజ్ కానున్నట్టు తెలుస్తోంది. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలను బట్టి అప్పుడే ఈ సిరీస్ లాంచ్ అయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
