మన పత్రిక, వెబ్డెస్క్ : దుబ్బాకలో ( DUBBAKA ) యూరియా టోకెన్ల పంపిణీ విషయంలో ఏఈఓ సంతోష్పై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం పిఎసిఎస్ కార్యాలయానికి యూరియా ( UREA ) రాగానే రైతులు పెద్ద ఎత్తున క్యూ కట్టారు. వినాయక చవితి పండుగ ఉన్నా, వర్షం కురుస్తున్నా రైతులు, ముఖ్యంగా మహిళా రైతులు గొడుగులు పట్టుకొని నిలబడ్డారు.
కానీ ఏఈఓ సంతోష్ తనకు నచ్చిన వారికి మాత్రమే అదనపు టోకెన్లు ఇచ్చాడు. ముందస్తుగా 40 నుండి 50 బ్యాగులకు సంబంధించిన టోకెన్లు తన అనుచరులకు అందించాడు. దీంతో ఉదయం నుంచి వర్షంలో నిలబడిన చాలామంది రైతులకు యూరియా లభించలేదు. ఈ అన్యాయమైన పంపిణీ పట్ల రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏఈఓపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పండుగ, వర్షం అనే లెక్కలు చూడకుండా క్యూలో నిలబడినా ప్రయోజనం లేకపోవడం రైతులను నిరాశకు గురిచేసింది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
