WhatsApp
Advertisement

Montha Cyclone : మొంథా తుఫాన్.. ఉప్పాడ స్థానికులను తరలించిన ప్రభుత్వం

Montha Cyclone : ప్రస్తుతం ఏపీలోని ఉభయ గోదావరి జిల్లాలను మొంథా తుఫాన్ ముంచెత్తుతోంది. ఈ తుఫాన్ ధాటికి ఏపీలోని ఇతర జిల్లాల్లోనూ భారీగా గాలులు వీయడంతో పాటు వర్షాలు కురుస్తున్నాయి. మొంథా తుఫాన్ ధాటికి కాకినాడ జిల్లా భారీగా దెబ్బతిన్నది. తీర ప్రాంతాల్లో ఉన్న ప్రజలను ఎప్పటికప్పుడు పునరావాస కేంద్రాలకు తరలిస్తోంది. కాకినాడ జిల్లా ఉప్పాడ స్థానికులను పునరావాస కేంద్రాలకు ఏపీ ప్రభుత్వం తరలించింది. మొంథా తుఫాన్ వల్ల ఉప్పాడలో భారీ వర్షాలతో పాటు భారీగా గాలులు వీస్తుండటంతో ఉప్పాడ ప్రజలను పునరావాస కేంద్రానికి తరలించి అక్కడే భోజన వసతిని కూడా ఏపీ ప్రభుత్వం కల్పించింది.

Advertisement