Advertisement

పొగాకు రైతుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని సీఎం చంద్రబాబు పట్టు

మన పత్రిక: ఆంధ్రప్రదేశ్‌లో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి సారించింది. ఈ క్రమంలో రైతులకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే కాకుండా, సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పట్టుబట్టారు.

రైతులను ఆదుకోవడానికి కేంద్ర బృందం మూడు ప్రధాన ప్రతిపాదనలను సిద్ధం చేసింది. వీటితో పాటు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పొగాకు కొనుగోలుదారులతో చర్చలు జరిపారు. ఈ అంశంపై మరింత స్పష్టత కోసం సోమవారం రోజున మరోసారి సమావేశం నిర్వహించనున్నారు.

Advertisement
Advertisement