మన పత్రిక, వెబ్డెస్క్: చంద్రగ్రహణం కారణంగా తిరుమల శ్రీవారి ఆలయ వేళల్లో టీటీడీ కీలక మార్పులు చేసింది. 2026 మార్చి 3న చంద్రగ్రహణం ఏర్పడనున్న నేపథ్యంలో, ఆ రోజు ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 7:30 గంటల వరకు ఆలయ తలుపులు మూసివేయనున్నారు. గ్రహణం విడిచిన తర్వాత రాత్రి 8:30 గంటలకు సంప్రోక్షణ నిర్వహించి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు. ఈ కారణంగా ఆ రోజు కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, సహస్ర దీపాలంకార సేవ వంటి ఆర్జిత సేవలను పూర్తిగా రద్దు చేశారు.
మరోవైపు, కడప జిల్లా దేవుని కడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో జనవరి 19 నుంచి 27 వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగనున్నాయి. జనవరి 24న స్వామివారి కల్యాణోత్సవం, 25న రథోత్సవం నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
