SS Rajamouli : బాహుబలి, ఆర్ఆర్ఆర్ లాంటి అద్భుతమైన కళాఖండాలను చిత్రీకరించి ప్రపంచ ఖ్యాతిని పొందిన గ్లోబల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ వారణాసి. ఈ మూవీలో సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరో. ప్రియాంకా చోప్రా హీరోయిన్. ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన టైటిల్ అనౌన్స్మెంట్ ఈవెంట్ ను నిర్వహించారు. ఈ ప్రాజెక్ట్ ను మొదటి నుంచి గ్లోబ్ట్రోటర్ మూవీగా పిలిచారు. ఈ మూవీ ఈవెంట్ లో హనుమాన్ ని కించపరిచేలా రాజమౌళి వ్యాఖ్యలు చేశాడని రాష్ట్రీయ వానర సేన సంఘం ఇప్పటికే సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే.
తాజాగా ఆయనపై మరో రెండు కేసులు నమోదయినట్లు తెలుస్తోంది. వారణాసి గ్లింప్స్ లో భాగంగా మహేశ్ బాబు లుక్ ను రివీల్ చేసిన బృందం.. అందులో మహేశ్ బాబు నందిపై కూర్చొని కనిపించాడు. హిందువులు ఎంతో పవిత్రంగా భావించే నందిపై హీరోను కూర్చోబెట్టడం ఏంటి.. హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయని ఆయనపై ఇంకో కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది.
అలాగే.. బాహుబలి ది ఎటర్నల్ లో వార్ ట్రైలర్ లో బాహుబలి, ఇంద్రుడితో యుద్ధం చేస్తున్నట్టుగా రాజమౌళి చూపించారని, అందుకే ఆయనపై మరో కేసు నమోదైనట్టుగా తెలుస్తోంది. మొత్తంగా ఆయన మీద ప్రస్తుతం మూడు కేసులు నమోదైనట్లు ఫిలిం నగర్ లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
