మన పత్రిక, వెబ్డెస్క్
తెలంగాణ అసెంబ్లీలో ( Telangana Assembly ) ఆమోదించిన పంచాయతీ రాజ్ చట్టం-2018 సవరణ బిల్లును ఆమోదించాలని కోరుతూ ఇవాళ అఖిలపక్ష నేతలు గవర్నర్ జిష్ణుదేవ్ వర్మను కలవనున్నారు. ఈ సమావేశానికి సంబంధించి అన్ని పార్టీల కీలక నేతలకు మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న లేఖలు రాశారు. రిజర్వేషన్ పరిమితిపై అన్ని రాజకీయ పార్టీలు ఏకాభిప్రాయంతో ఉన్నాయని మంత్రి పొన్నం ప్రభాకర్ ( ponnam prabhakar ) హైలైట్ చేశారు. ఈ విషయాన్ని గవర్నర్ తప్పక పరిగణనలోకి తీసుకోవాలని కోరారు.
బిల్లుకు ఆమోదం తెలిపేందుకు ఏమి ఇబ్బంది ఉందని ప్రశ్నించారు. ప్రజాస్వామ్య సూత్రాలకు అనుగుణంగా బిల్లు సమాజానికి అనుకూలంగా ఉందని పేర్కొన్నారు. అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించిన బిల్లుపై గవర్నర్ త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని అఖిలపక్ష నేతలు భావిస్తున్నారు. పంచాయతీ ఎన్నికల వ్యవస్థకు సంబంధించి ఈ సవరణ చాలా కీలకం. ఈ సమావేశం ద్వారా అన్ని పార్టీల సంయుక్త సంకేతం ఇవ్వడం లక్ష్యంగా పెట్టుకున్నారు. గవర్నర్ సానుకూల స్పందన ఇస్తారని ఆశిస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
