మన పత్రిక, వెబ్డెస్క్: తెలంగాణ ప్రభుత్వం పలు కీలక పదవులను భర్తీ చేసింది. పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్గా ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావును నియమించింది. అదేవిధంగా, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించింది.
మంత్రి పదవి ఆశించిన ఈ ఇద్దరు నేతలకు కేబినెట్ హోదా కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సుదర్శన్ రెడ్డికి 6 గ్యారంటీల అమలు బాధ్యతను కూడా అదనంగా అప్పగించారు. ఆయన కేబినెట్ సమావేశాలకు ప్రత్యేక ఆహ్వానితుడిగా వ్యవహరించనున్నారు. మంత్రులకు వర్తించే అన్ని సదుపాయాలను వీరికి కల్పిస్తూ ప్రభుత్వం జీవో (GO) జారీ చేసింది.
Advertisement
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
Advertisement
