మన పత్రిక, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు మళ్లీ ఊపందుకోనున్నాయి. గురువారం నాడు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణ పరిధిలోని ఐదు జిల్లాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తూ అధికారులు ఎల్లో అలర్ట్ జారీ చేశారు.
భారీ వర్షాలు కురిసే జిల్లాలు
భారత వాతావరణ శాఖ (IMD) అంచనాల ప్రకారం, ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్ మరియు నిజామాబాద్ జిల్లాల్లో అక్కడక్కడ విస్తారంగా భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. జులై 28 వరకు రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు. రాష్ట్రంలోని దాదాపు 24 జిల్లాల్లో ఇప్పటికీ సాధారణం కంటే తక్కువ వర్షపాతమే నమోదైనట్లు పేర్కొన్నారు.
అప్రమత్తంగా ఉండాలని సూచన
ప్రస్తుత వర్ష సూచన నేపథ్యంలో ప్రయాణికులు, అత్యవసర పనులపై బయటకు వెళ్లేవారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఉరుములు, మెరుపులు వచ్చే సమయంలో సురక్షితమైన ప్రదేశాల్లో ఆశ్రయం పొందాలని హెచ్చరించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
