మన పత్రిక, వెబ్డెస్క్
బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ జారీ చేసిన జీవో 9పై హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. గవర్నర్ ఆమోదం లేకుండా ఈ జీవో జారీ చేయడంపై న్యాయస్థానం ప్రశ్నలు సంధించింది.
హైకోర్టు శనివారం దాదాపు గంటన్నర పాటు జీవో 9ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై విచారణ జరిపింది. బిల్లుకు గవర్నర్ ఆమోదం రాకముందే సబార్డినేట్ లెజిస్లేషన్ చేయడం చట్టబద్ధమేనా? అని న్యాయస్థానం ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్లో ఉండగానే జీవో ఎందుకు జారీ చేశారు? అని కూడా నిలదీసింది.
ప్రభుత్వం హామీ ఇవ్వకపోతే జీవో 9 అమలును నిలిపివేస్తామని కోర్టు స్పష్టం చేసింది. అయితే ఏజీ స్పందించకపోవడంతో తదుపరి విచారణను అక్టోబర్ 8కి వాయిదా వేసింది. ఈ క్రమంలో స్థానిక సంస్థల ఎన్నికలకు నోటిఫికేషన్ వెలువడినా, పిటిషన్లపై విచారణ జరుపుతామని కోర్టు ప్రకటించింది.
రాష్ట్ర ఎన్నికల సంఘంతో పాటు ప్రభుత్వ శాఖల ముఖ్య కార్యదర్శులకు నోటీసులు జారీ చేసింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని ఆదేశించింది. పిటిషనర్లు రిజర్వేషన్లు 50% మించితే రాజ్యాంగ విరుద్ధమని వాదించారు. ఇప్పుడు 67%కి చేరుతుందని హెచ్చరించారు.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
