మన పత్రిక, వెబ్డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా ప్రైవేట్ ప్రొఫెషనల్ కాలేజీలు (Telangana bandh november 3) నిరవధిక బంద్కు పిలుపునిచ్చాయి. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోవడమే ఇందుకు కారణం. ప్రభుత్వం తక్షణమే రూ. 900 కోట్లు విడుదల చేయాలని ఫెడరేషన్ ఆఫ్ అసోసియేషన్స్ ఆఫ్ తెలంగాణ హయ్యర్ ఇన్స్టిట్యూషన్స్ (FATHI) డిమాండ్ చేసింది.
బకాయిల కారణంగా సిబ్బందికి జీతాలు, బిల్లులు చెల్లించలేక తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని యాజమాన్యాలు ఆవేదన వ్యక్తం చేశాయి. ఈ బంద్కు ఫ్యాకల్టీ అసోసియేషన్లు, విద్యార్థి సంఘాలు కూడా మద్దతు ప్రకటించాయి.
నిధులు దశలవారీగా విడుదల చేస్తామని ప్రభుత్వం చెబుతున్నా, యాజమాన్యాలు నమ్మడం లేదు. తక్షణమే బకాయిలు విడుదల చేయకపోతే బంద్ను నిరవధికంగా కొనసాగిస్తామని ‘ఫాథీ’ హెచ్చరించింది. ఈ బంద్ కారణంగా రేపటి నుంచి తరగతులు, పరీక్షలు నిలిచిపోయే అవకాశం ఉంది.
ఇవి కూడా చదవండి :
- గురు పుష్య యోగం.. 12 రాశుల వారి నేటి ఫలితాలు
- ఏపీలో విద్యార్థులందరికీ దివ్యాంగ స్క్రీనింగ్.. టైమ్లైన్ విడుదల
- Tesla Hyderabad: హైటెక్ సిటీలో ఎక్స్పీరియన్స్ సెంటర్ ప్రారంభం
- Railway Ticket Sprocket Holes: పాత రైల్వే టికెట్లపై ‘స్ప్రోకెట్ హోల్స్’ ఎందుకు ఉండేవంటే?
- Vijay Deverakonda Cricket League Issue: టీజీ టీ20 టోర్నీకి అనుమతులు లేవు
