WhatsApp
Advertisement

చరిత్ర సృష్టించిన టీమ్‌ఇండియా.. కివీస్‌ను చిత్తుచేసి మూడోసారి టీ20 వరల్డ్ కప్ కైవసం!

మన పత్రిక వెబ్​డెస్క్: భారత క్రికెట్ అభిమానుల కల సాకారమైంది! సొంతగడ్డపై సూర్యకుమార్ యాదవ్ సేన అద్భుతం చేసింది. 2026 టీ20 ప్రపంచకప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ను 96 పరుగుల భారీ తేడాతో చిత్తుచేసిన టీమ్‌ఇండియా.. ముచ్చటగా మూడోసారి పొట్టి ఫార్మాట్‌లో విశ్వవిజేతగా ఆవిర్భవించింది.

ప్రపంచ క్రికెట్ చరిత్రలో మూడు టీ20 టైటిళ్లు గెలిచిన ఏకైక జట్టుగా, అలాగే సొంతగడ్డపై (ఆతిథ్య దేశంగా) టీ20 ట్రోఫీ నెగ్గిన తొలి జట్టుగా భారత్ సరికొత్త చరిత్ర లిఖించింది. ఎంఎస్ ధోనీ, రోహిత్ శర్మల తర్వాత భారత్‌కు వరల్డ్ కప్ అందించిన మూడో సారథిగా సూర్యకుమార్ యాదవ్ నిలిచి దేశ ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేశాడు.

Advertisement

భారత బ్యాటర్ల విధ్వంసం (255/5): ఫైనల్ పోరులో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 255 పరుగుల భారీ స్కోరు సాధించింది.

  • సంజు శాంసన్ (89) ఆకాశమే హద్దుగా చెలరేగి భారీ ఇన్నింగ్స్ ఆడాడు.
  • ఓపెనర్లు ఇషాన్ కిషన్ (54), కుర్ర సంచలనం అభిషేక్ శర్మ (52) హాఫ్ సెంచరీలతో కివీస్ బౌలర్లపై విరుచుకుపడి జట్టుకు శుభారంభం అందించారు.

కుప్పకూలిన కివీస్ (159 ఆలౌట్): 256 పరుగుల కష్టసాధ్యమైన లక్ష్య ఛేదనలో న్యూజిలాండ్ 19 ఓవర్లలో 159 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బ్యాటర్లలో టిమ్ సీఫెర్ట్ (52), మిచెల్ శాంట్నర్ (43) మాత్రమే కాసేపు పోరాడారు. భారత బౌలర్ల కట్టుదిట్టమైన బంతులకు మిగతా బ్యాటర్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు.

  • ‘బూమ్ బూమ్’ జస్‌ప్రీత్ బుమ్రా 4 వికెట్లతో కివీస్ నడ్డి విరవగా.. స్పిన్నర్ అక్షర్ పటేల్ 3 వికెట్లు పడగొట్టాడు.
  • హార్దిక్ పాండ్య, వరుణ్ చక్రవర్తి, అభిషేక్ శర్మ తలో వికెట్ తీసి విజయంలో కీలక పాత్ర పోషించారు.
Advertisement