మన పత్రిక, సూర్యాపేట: జిల్లాలో ఈ నెల 28న నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో భారీ సంఖ్యలో కేసులు పరిష్కారమయ్యాయి. పోలీసు, న్యాయ, ఇతర అనుబంధ శాఖల సమన్వయంతో జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,890 కేసులను వేగవంతంగా పరిష్కరించినట్లు సూర్యాపేట జిల్లా ఎస్పీ కే. నరసింహ ఒక ప్రకటనలో వెల్లడించారు.
ప్రజలకు త్వరితగతిన న్యాయం అందించడమే ప్రధాన లక్ష్యంగా ఈ లోక్ అదాలత్ నిర్వహించినట్లు ఆయన తెలిపారు. పరిష్కారమైన కేసుల వివరాలను ఎస్పీ వెల్లడిస్తూ.. ఇందులో ఎంవీ యాక్ట్, డ్రంక్ అండ్ డ్రైవ్ (DD) కేసులు 1845, ఈ-పెట్టీ కేసులు 1463, ఐపీసీ కేసులు 498, ఎస్ఎల్ఎల్ (SLL) కేసులు 84 ఉన్నట్లు స్పష్టం చేశారు.
కోర్టుల్లో ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న చిన్నచిన్న కేసులను రాజీ మార్గంలో, చట్టబద్ధంగా పరిష్కరించుకోవడం ద్వారా ప్రజలకు సమయం, డబ్బు ఆదా అవుతాయని ఎస్పీ సూచించారు. దీర్ఘకాలిక న్యాయ ప్రక్రియల నుంచి విముక్తి పొందేందుకు భవిష్యత్తులోనూ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలను కోరారు. రికార్డు స్థాయిలో కేసుల పరిష్కారానికి కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బంది, న్యాయవాదులను ఎస్పీ అభినందించారు.
ఇవి కూడా చదవండి :
- Peddi : అడ్వాన్స్ బుకింగ్స్ లో పెద్ది జోరు… సెంచరీ ఖాయం…
- Summer Holidays : ఎండల ఎఫెక్ట్ వేసవి సెలవులు పొడిగింపు..
- TG TET 2026 Schedule : టీజీ టెట్ 2026 షెడ్యూల్ విడుదల.. 10 సెషన్లలో ఆన్లైన్ పరీక్షలు
- TG Employees Health Scheme : ప్రభుత్వ ఉద్యోగుల కోసం హెల్త్ కేర్ ట్రస్ట్..
- AP News : వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా మయూరి రఘునాథ్ రెడ్డి
