మన పత్రిక, వెబ్డెస్క్: సూర్యాపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మద్యం టెండర్ల డ్రాలో ఓ భార్యాభర్తలను అదృష్టం వరించింది. జిల్లాలోని 93 మద్యం దుకాణాలకు 2070 దరఖాస్తులు రాగా, కలెక్టర్ తేజస్ నందలాల్ పవర్ డ్రా పద్ధతిలో దుకాణాలను ఎంపిక చేశారు.
ఈ డ్రాలో వేములపల్లి మండలం లక్ష్మీదేవి గూడెం గ్రామానికి చెందిన ఎలికట్టి భరత్కు గెజిట్ నెంబర్ 21 షాపు దక్కింది. అదేవిధంగా, ఆయన భార్య శ్రావణికి గెజిట్ నెంబర్ 13 లో మరో షాపు దక్కించుకున్నారు. వందలాది టెండర్లలో భార్యాభర్తలు ఇద్దరికీ షాపులు లభించడంతో పలువురు వారికి శుభాకాంక్షలు తెలిపారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
