Advertisement
supreme orders cbi inquiry in karur stampede incident

Karur Stampede : కరూర్ తొక్కిసలాట.. సీబీఐ దర్యాప్తునకు సుప్రీం ఆదేశాలు

Karur Stampede : కరూర్ తొక్కిసలాటపై సుప్రీం కోర్టు సీరియస్ అయింది. ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఈ ఘటనపై మద్రాసు హైకోర్టు సిట్ ను ఏర్పాటు చేసింది. సిట్ దర్యాప్తును కూడా ప్రారంభించింది. కానీ, సిట్ దర్యాప్తుపై తమకు నమ్మకం లేదని, సిట్ దర్యాప్తు సక్రమంగా చేయడం లేదని టీవీకే పార్టీ సుప్రీం కోర్టును ఆశ్రయించింది.

Advertisement

టీవీకే పార్టీ తరుపు లాయర్ల వాదనలను విన్న సుప్రీం కోర్టు, వెంటనే ఈ ఘటనపై సీబీఐ దర్యాప్తు చేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Advertisement

గత నెల సెప్టెంబర్ 27న తమిళనాడులోని కరూర్ లో టీవీకే చీఫ్ విజయ్ నిర్వహించిన ప్రచార ర్యాలీలో భారీగా జనాలు రావడంతో తొక్కిసలాట జరిగి 47 మంది ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.

► Read latest Telugu News
► Follow us on WhatsApp & Google News

Advertisement
Advertisement
Advertisement