Advertisement

నీట్ నిరసనకారులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఆర్ఏఎఫ్ అధికారిణి సోనియా సెహ్రావత్

మన పత్రిక: నీట్ పేపర్ లీకేజీ వ్యవహారంలో ఆందోళనలు నిర్వహిస్తున్న విద్యార్థులను ఉద్దేశించి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (RAF) అధికారిణి Sonia Sehrawat చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ విద్యార్థులు ‘పార్లమెంట్ మార్చ్’ చేపట్టారు. ఈ నిరసనల సమయంలో భద్రతా బందోబస్తు విధుల్లో ఉన్న సోనియా సెహ్రావత్ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో చనిపోయిన బొద్దింక ఫొటోను షేర్ చేశారు. తమను తాము సరిదిద్దుకోలేరు కానీ దేశాన్ని బాగుచేయాలని చూస్తున్నారంటూ ఆ ఫొటోకు క్యాప్షన్ రాశారు.

ఈ పోస్ట్‌పై విద్యార్థులు, నెటిజన్ల నుంచి తీవ్ర విమర్శలు రావడంతో ఆమె దానిని తొలగించారు. ఈ నిరసనలకు నాయకత్వం వహిస్తున్న ‘కాక్రోచ్ జనతా పార్టీ’ (CJP) ఎక్స్ వేదికగా స్పందిస్తూ, శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిని బొద్దింకలతో పోల్చడం దిగ్భ్రాంతికరమని పేర్కొంది.

Advertisement

సర్వీస్ నిబంధనల ప్రకారం విధుల్లో ఉన్న అధికారులు వ్యక్తిగత సోషల్ మీడియా ఖాతాలలో రాజకీయ వ్యాఖ్యలు చేయడం, సీఆర్పీఎఫ్ లేదా ఆర్ఏఎఫ్ యూనిఫామ్‌లో ఉన్న ఫొటోలను ప్రొఫైల్ పిక్చర్‌గా పెట్టడం నిషిద్ధం. అయితే సోనియా తన ఇన్‌స్టాగ్రామ్‌లో యూనిఫామ్ ఫొటోనే ప్రొఫైల్‌గా ఉంచడంపై విమర్శలు వస్తున్నాయి. హర్యానాకు చెందిన సోనియా సెహ్రావత్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 6 లక్షల మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.

Advertisement