బిగ్ బాస్ 9 సీజన్లో ఆరో వారం భరణి ఎలిమినేషన్ తర్వాత హౌస్ లో ఎంటర్టైన్మెంట్ డోసు కాస్త తగ్గిందన్న విషయం తెలిసిందే. అందుకే బిగ్ బాస్ ఈ వారం దొంగల ముఠా అంటూ టాస్క్ స్టార్ట్ చేసి హౌస్ మేట్స్ తో ఫన్ రాబట్టుకునే ప్రయత్నం చేసినా అది అంతగా పేలలేదు. అందుకే షో ని మరింత ఇంట్రెస్టింగ్ గా ఎలివేట్ చెసేందుకు కొత్త పథకం ఆలోచించారు బిగ్ బాస్.
ప్రస్తుతం జరుగుతున్న టాస్క్ లో దొంగల ముఠా లీడర్స్ అయిన సంజన, మాధురి లను పట్టుకునేందుకు ఇద్దరు పోలీస్ లను హౌస్ బయటినుండి తీసుకొచ్చారు. వాళ్లెవరో కాదు గత సీజన్ 7 లో కంటెస్టెంట్స్ అయిన అమర్ దీప్ (Amar deep), అంబటి అర్జున్ (Ambanti arjun). ఏడో సీజన్లో ఇదే ఇలాంటి టాస్క్ లోనే వీళ్ళు పోలీస్ లు గా చేసిన ఎంటర్టైన్మెంట్ అంతా ఇంతా కాదు, అందుకే ఇప్పుడు షో ని మరింత ఎంటర్టైన్ చేయడానికి వీళ్ళని తీసుకొచ్చారు.
హౌస్ లోకి ఈరోజు జరగబోయే ఎపిసోడ్ లో ఎంట్రీ ఇచ్చిన వీళ్ళిద్దరూ, హౌస్ లోని టాస్క్ మొత్తం ఆడించి వెళ్లపోతారని సమాచారం. మరి రాబోయే ఈ ఎపిసోడ్ ఎంత వరకు ఎంటర్టైనింగ్ గా ఉంటుందో చూడాలి.
ఇవి కూడా చదవండి :
- WIPRO Recruitement : హైదరాబాద్ లో విప్రో వాక్ – ఇన్ డ్రైవ్.. ఫ్రెషర్స్కు గోల్డెన్ ఛాన్స్! ఒక్కరోజే టైం..
- నల్గొండ జిల్లా నాంపల్లి వద్ద రోడ్డు ప్రమాదం: ముగ్గురు మృతి
- మార్చి 22న రైతు భరోసా నిధుల విడుదల: సిద్దిపేటలో సీఎం ప్రారంభం
- బెంగళూరు: 2 నిమిషాలు లేటని విద్యార్థికి ఎండలో శిక్ష
- ఇరాన్ క్షిపణి దాడులు: దుబాయ్ ఎయిర్పోర్ట్ మూసివేత
