రామ్చరణ్ కు సీఎం సిద్ధరామయ్య సత్కారం: మైసూరులో ప్రత్యేక సమావేశం
ప్రముఖ తెలుగు సినీ నటుడు రామ్చరణ్ ( Ram Charan ) ఆదివారం మైసూరులో ( Mysore ) కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ( CM Siddaramaiah ) కలిశారు. రామ్చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ సినిమా ( Peddi Movie ) చిత్రీకరణ మైసూరులో జరుగుతోంది. సీఎం సిద్ధరామయ్య కూడా మైసూరులో ఉండటంతో, ఆయన ఆహ్వానం మేరకు రామ్చరణ్ మర్యాద పూర్వకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా రామ్చరణ్ సీఎంకు శాలువా సమర్పించారు.
అనంతరం సీఎం సిద్ధరామయ్య రామ్చరణ్కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువా కప్పారు. ఇద్దరూ కాసేపు సినిమాల గురించి స్నేహపూర్వకంగా మాట్లాడుకున్నారు. ‘పెద్ది’ సినిమా పాట చిత్రీకరణ ప్రస్తుతం మైసూరులో జరుగుతోంది. ఈ సన్నివేశంలో వెయ్యి మంది డాన్సర్లు పాల్గొంటున్నారు. బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి జాన్వీ కపూర్ కథానాయిక. కన్నడ నటుడు శివరాజ్ కుమార్ కీలక పాత్ర పోషిస్తున్నారు. ‘పెద్ది’ సినిమా 2025 మార్చి 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
