Pista House : హైదరాబాద్ నగరంలోని ఫేమస్ హోటల్స్ అయిన పిస్తా హౌస్, షాగౌస్, మెహిఫిల్ లాంటి హోటళ్లపై ఐటీ సోదాలు జరుగుతున్నాయి. గత రెండు రోజుల నుంచి ఈ సోదాలు జరుగుతున్నాయి. ఐటీ అధికారులు ఈ హోటళ్లకు చెందిన చైర్మన్లు, డైరెక్టర్లు ఇళ్లలో ఒకేసారి సోదాలు చేస్తున్నారు.
రాజేంద్రనగర్ లో ఉన్న గోల్డెన్ హైట్స్ కాలనీలో ఉంటున్న పిస్తా హౌస్ ఓనర్స్ అయిన మహమ్మద్ మాజీద్, మహమ్మద్ ముస్తాన్ ఇళ్లలో సోదాలు నిర్వహిస్తున్నారు. షాగౌస్, మెహిఫిల్ చైర్మన్లు, డైరెక్టర్ల ఇళ్లలోనూ ఐటీ దాడులు కొనసాగుతున్నాయి.
ఐటీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. లక్డీకపూల్, షేక్పేట్, అత్తాపూర్, టోలీచౌకి, గచ్చిబౌలి లాంటి ప్రాంతాల్లో రెండు రోజులుగా సోదాలు కొనసాగుతున్నాయి. ఈ సోదాల్లో 20 కోట్ల రూపాయల నగదును, భారీగా బంగారాన్ని సీజ్ చేసినట్టు సమాచారం. అలాగే ఆయా హోటళ్లలో పని చేస్తున్న వర్కర్లను బినామీలుగా పెట్టుకొని వాళ్ల మీద ఆస్తులు ఉన్న పలు డాక్యుమెంట్లను, బ్యాంకు లాకర్లను అధికారులు గుర్తించారు. హవాలాగా బ్లాక్ మనీని ఈ హోటళ్ల ఓనర్స్ దారి మళ్లించినట్టుగా అధికారులు గుర్తించినట్టు తెలుస్తోంది. అందుకే ఇవాళ కూడా సోదాలు నిర్వహించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది.
ఇవి కూడా చదవండి :
- టీమిండియాలో తీవ్ర విషాదం: క్యాన్సర్తో క్రికెటర్ రింకు సింగ్ తండ్రి కన్నుమూత!
- AP BRAGCET 2026: మార్చి 1న పరీక్ష.. మొబైల్లోనే ఇలా డౌన్లోడ్ చేసుకోండి!
- TG PGECET 2026 Notification : పీజీ ఇంజనీరింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్..
- మీ ఫేవరెట్ కలర్ ఏంటి? ఆ రంగును బట్టి మీరెలాంటి వారో ఇట్టే చెప్పేయొచ్చు!
- తెలంగాణకు ఐఎండీ రెయిన్ అలర్ట్: ఒక్కసారిగా మారిన వాతావరణం.. ఆ జిల్లాలకు ఎల్లో వార్నింగ్!
