మన పత్రిక, వెబ్డెస్క్
కేంద్ర మంత్రి మాన్సుఖ్ మాండవీయ ప్రధాన మంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన ( PMVBRY ) అధికారిక పోర్టల్ను ప్రారంభించారు. పోర్టల్ pmviksitbharatrozgaryojana.com ఆగస్టు 18 నుంచి అందుబాటులో ఉంది.
ఆగస్టు 1 నుంచి ఇప్పటివరకు ఎన్రోల్ అయిన కొత్త ఉద్యోగులు, యజమానులు ప్రయోజనాల కోసం పోర్టల్ లో రిజిస్టర్ చేసుకోవాలి. లేదా ఉమాంగ్ యాప్ ద్వారా UAN అప్లోడ్ చేయాలి. ఈ పథకం ప్రకారం మొదటిసారి ఉద్యోగంలో చేరే వారికి రూ. 15,000 వరకు ప్రోత్సాహకం లభిస్తుంది. ఇది ఒక నెల సగటు వేతనం (బేసిక్ + DA) గా రెండు విడతల్లో చెల్లిస్తారు.
పథకం రెండు భాగాలు: పార్ట్-ఏ (ఉద్యోగులు), పార్ట్-బీ (యజమానులు). యజమానులు కొత్త ఉద్యోగులను నియమిస్తే జీతం ఆధారంగా రూ. 1,000 నుంచి రూ. 3,000 వరకు ప్రోత్సాహకం లభిస్తుంది. ఈపీఎఫ్ ( EPFO ) మినహాయింపు సంస్థలకు కూడా పథకం వర్తిస్తుంది. కానీ ECR దాఖలు చేయాలి. ఉమాంగ్ యాప్ ద్వారా యూఏఎన్ ఓపెన్ చేయాలి. 2025 ఆగస్టు 1 నుంచి 2027 జులై 31 వరకు 3.5 కోట్ల ఉద్యోగాల సృష్టి లక్ష్యంగా రూ. లక్ష కోట్లు కేటాయించారు.
Mana Patrika Web Desk is our editorial team covering breaking news, education, jobs, politics, technology, entertainment, and current affairs. The team publishes clear, accurate, and reader-friendly updates after reviewing information from reliable sources.
