సాంప్రదాయ వృత్తులపై ఆధారపడిన కళాకారులకు కేంద్ర ప్రభుత్వం ‘ప్రధాన మంత్రి విశ్వకర్మ యోజన’ ద్వారా భారీ ఊరటనిస్తోంది. పెట్టుబడి లేక ఇబ్బంది పడుతున్న మేస్త్రీలు, టైలర్లు, వడ్రంగులు, స్వర్ణకారులు వంటి చేతివృత్తుల వారికి ఈ పథకం కింద రూ.3 లక్షల వరకు పూచీకత్తు లేని రుణం లభిస్తుంది. వడ్డీ వ్యాపారుల బారి నుంచి రక్షించి, స్వయం ఉపాధిని ప్రోత్సహించడమే దీని ముఖ్య ఉద్దేశం.
ఈ రుణాన్ని రెండు విడతల్లో అందిస్తారు. మొదటి విడతలో రూ.1 లక్ష, అది చెల్లించిన తర్వాత రెండో విడతలో రూ.2 లక్షలు ఇస్తారు. లబ్ధిదారులు కేవలం 5 శాతం వడ్డీ చెల్లిస్తే సరిపోతుంది. 18 ఏళ్లు నిండిన వారు అర్హులు కాగా, ఒక కుటుంబంలో ఒక్కరికి మాత్రమే ఈ అవకాశం వర్తిస్తుంది. గత ఐదేళ్లలో ఇతర ప్రభుత్వ రుణ పథకాలు పొంది ఉండకూడదు.
Advertisement
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
Advertisement
