మన పత్రిక, వెబ్డెస్క్
ప్రధాన మంత్రి స్వానిధి యోజన ( PM SVANidhi ) వీధి వ్యాపారులకు ఆర్థిక స్థిరత్వం కలిగించేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబడిన కీలక పథకం. జూన్ 1, 2020న ప్రారంభమైన ఈ పథకం ఇప్పుడు మార్చి 31, 2030 వరకు పొడిగించబడింది. లబ్ధిదారులు ఇప్పుడు రూ. 90,000 వరకు రుణం పొందవచ్చు. ఇది గతంలో రూ. 80,000 గా ఉండేది. ఎటువంటి భద్రత లేకుండా ఈ రుణం అందుబాటులో ఉంటుంది.
రుణం మూడు విడతల్లో అందిస్తారు: మొదటి విడతగా రూ. 15,000, రెండవ విడతగా రూ. 25,000 మరియు మూడవ విడతగా రూ. 50,000. మొత్తం రుణం పొందాలంటే, మొదటి రెండు విడతల రుణాలను పూర్తిగా తిరిగి చెల్లించాలి. రుణం 12 నెలల పాటు వాయిదాలలో చెల్లించాలి. సరిగ్గా చెల్లించిన వారికి తిరిగి రుణం పొందే అవకాశం ఉంటుంది.
దరఖాస్తు చేయడానికి ఆధార్ కార్డు తప్పనిసరి. మొబైల్ నంబర్ ఆధార్తో లింక్ అయి ఉండాలి. e-KYC ద్వారా ధృవీకరణ పూర్తి చేసి, పట్టణ స్థానిక సంస్థ నుండి లేఖ సమర్పించాలి. ఆన్లైన్ లేదా కామన్ సర్వీస్ సెంటర్ (CSC) ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. వాణిజ్య బ్యాంకులు, RRBలు, SFBలు మరియు సహకార బ్యాంకుల ద్వారా ఈ పథకం అమలవుతోంది. వడ్డీ రేట్లు ప్రస్తుత మార్కెట్ రేట్లకు అనుగుణంగా ఉంటాయి. ఈ పథకం చిన్న వ్యాపారులకు పెద్ద ఉపశమనం కలిగిస్తోంది.
ఇవి కూడా చదవండి :
- Freshers Jobs at Infosys : Infosys లో ఫ్రెషర్స్కు బంపర్ ఛాన్స్… ₹21 LPA వరకు ప్యాకేజ్!
- AutoRABIT Freshers Recruitment : AutoRABIT లో ఫ్రెషర్స్ కు భారీ అవకాశం… ₹4 లక్షల ఇంటర్న్షిప్ తో IT కెరీర్ స్టార్ట్!
- Peddi : పెద్ది టీమ్ కి షాక్.. స్పెషల్ సాంగ్ విజువల్స్ లీక్…
- Mega158 : ఫైనల్లీ అప్డేట్ వచ్చేసింది.. అతి త్వరలో మొదలు..
- Raghav Chadda : ఢిల్లీ రాజకీయాల్లో బిగ్ షాక్: ఆప్లో చీలిక… బీజేపీలో విలీనం?
