WhatsApp
Advertisement

Narendra Modi : 25 ఏళ్ల నుంచి అలుపెరగని పోరాటం.. దేశ ప్రజలకు మోదీ కృతజ్ఞత

Narendra Modi : సరిగ్గా ఈ రోజే అంటే 7 అక్టోబర్, 2001 న గుజరాత్ ముఖ్యమంత్రిగా తొలిసారి ప్రమాణ స్వీకారం చేశారు ప్రధాని నరేంద్ర మోదీ. ఆరోజు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 25 ఏళ్లు. ఈసందర్భంగా అప్పటి రోజులను ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా గుర్తు చేసుకున్నారు.

అప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తోడుగా ఉన్న దేశ ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను. ప్రభుత్వంలో ఒక బాధ్యతాయుతమైన పదవిని తీసుకొని నేటికి 25 ఏళ్లు. నా దేశ ప్రజలకు ఈ సందర్భంగా కృతజ్ఞత తెలియజేస్తున్నాను. దేశ అభివృద్ధి కోసం అప్పటి నుంచి ఇప్పటి వరకు నా శాయశక్తులా కృషి చేస్తూనే ఉన్నాను.. అంటూ మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

Advertisement
Advertisement